రెండు నెలల క్రితం గల్వాన్ వ్యాలీలో భారత్- చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటన అని భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ అన్నారు. .శాంతియుత ఒప్పందాలతో రు దేశాల మద్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలి అని అయన అన్నారు.
చైనా భారత్ను ఒక ప్రత్యర్థిగా కాకుండా భాగస్వామిగా చూస్తుందన్నారు. సంప్రదింపుల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టి తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలన్నారు. ఇదే సమయంలో ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలకు భంగం కలిగించకుండా రెండు దేశాలు ముందుకు సాగాలని తెలిపారు. కాగా, గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో గత మూడు నెలలుగా ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది
ఏ దేశమూ ప్రపంచం నుంచి వేరు చేయబడదు. సొంతంగా అభివృద్దిని మాత్రమే కోరుకుంటుంది. స్వావలంబనకు కట్టుబడి ఉండటమే కాకుండా ప్రపంచీకరణ ధోరణికి అనుగుణంగా అడుగులు వేయాలి. భారత్, చైనా ఆర్థికంగా బలమైన దేశాలు. చాలా సంవత్సరాలుగా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతుంది. దక్షిణ ఆసియాలో భారత్ కూడా చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు అయస్కాంతాల వలె ఉండాలని నేను భావిస్తున్నాను’ అని ఒక ప్రకటనలో సన్ వెడాంగ్ తెలిపారు. . ఇరు దేశాల్లో పురాతన నాగరికతకు సంబంధించి అపారమైన పరిజ్ఞానం ఉందని, చర్చల ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకుందామని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.