హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. బీజేపీ-జేజేపీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం
హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. బీజేపీ-జేజేపీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం 2.15గంటలకి మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
శనివారం(అక్టోబర్ 26,2019) కేంద్ర మంత్రి రవిశకంకర్ ప్రసాద్, మనోహర్ లాల్ ఖట్టర్, దుష్యంత్ చౌతాలా హర్యానా గవర్నర్ ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం 2.15గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం ఉంటుందని ఖట్టర్ తెలిపారు. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకుముందు బీజేపీ శాసనసభా పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్ను బీజేఎల్పీ ఎన్నుకుంది. దీంతో సీఎంగా రెండోసారి కట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన ఖట్టర్ కి ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మిఠాయి తినిపించారు.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాతో… జేజేపీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా సమావేశం తర్వాత రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఒప్పందం ప్రకారం.. దుష్యంత్ సింగ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు జేజేపీ చీఫ్ దుష్యంత్ తెలిపారు.
హర్యానాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 మంది ఎమ్మెల్యేల బలం అవసరం.
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు, ఇతరులు మిగతా 10 సీట్లు గెలిచారు. తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. అయితే, ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది. దీంతో బీజేపీ-జేజేపీ సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కానుంది.
ML Khattar: We have stake claim to form govt in Haryana. Governor has accepted our proposal & invited us. I have tendered my resignation which has been accepted. Tomorrow at 2:15 PM oath taking ceremony will be held at Raj Bhavan. Dushyant Chautala will take oath as Deputy CM. pic.twitter.com/gukF9WWFbk
— ANI (@ANI) October 26, 2019