2011నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం( India Against Corruption), ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక బీజేపీ హస్తముందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్పటి UPA ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు RSS-BJP కుట్ర చేశాయని. రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ను అధికారం నుంచి తప్పించి గద్దెనెక్కడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున మద్దతిచ్చాయని ఆప్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. ఈ కుట్రల గురించి అందరికీ తెలిసిన విషయాన్ని ఆప్ వ్యవస్థాపక సభ్యుడు ధ్రువీకరించారని రాహుల్ ట్వీట్ చేశారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో ప్రశాంత్ భూషణ్ ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనకు ఈ ఉద్యమం ప్రధాన కారణం. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 2015లో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ను ఆమ్ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
What was known to us has been confirmed by a founding AAP member.
The IAC movement & AAP were propped up by the RSS/BJP to subvert democracy and bring down the UPA government.https://t.co/QDYyOOTtw7
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020