ఇండియన్ ముస్లింలే కరోనా వ్యాప్తి చేయాలంటోన్న ఇస్లామిక్ స్టేట్

ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతుంటే.. ఇస్లామిక్ స్టేట్ ఆన్‌లైన్ పబ్లికేషన్ ‘వాయీస్ ఆఫ్ హింద్’ ఇదంతా ఇండియన్ ముస్లింలు చేసిందేనని అంటోంది. యాంటీ ఇండియా ప్రోపగాండా తెరమీదకు తీసుకొచ్చి.. మహమ్మారిని వాడుకుంటూ ఇండియన్లు కొవిడ్ క్యారియర్లుగా మారారని అంటోంది.

ఆ మ్యాగజైన్ లో 17పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ ను ఇండియా మీడియా యాక్సెస్ చేసింది. అందులో సాధ్యమైనంత మంది ఖఫ్పర్స్(నాన్ బిలీవర్స్)ను చంపేయండంటూ రాసుకొచ్చింది. పైగా దాని కవర్ పేజీలో నిజాముద్దీన్ మర్కజ్ ఈవెంట్ ను ముద్రించారు. బిలీవర్స్ ఒక్కరే నిలబడాలి.. మిగిలిన వారంతా పడిపోవాల్సిందేనని అందులో పేర్కొన్నారు.

మీకు సాధ్యమైనంత వరకూ చేతిలో ఆయుధాలు ఉంచుకోండి. అవకాశం వచ్చినప్పుడల్లా నాన్ బిలీవర్స్ ను తుదముట్టించండి. చైన్లు, తాళ్లు, వైర్లు రెడీగా ఉంచుకుని వారిని చచ్చేవరకూ కొట్టండి అని ఇస్లామిక్ స్టేట్ పబ్లికేషన్ స్టేట్స్ పేర్కొంది. పదునైన ఆయుధం గ్లాసు వాడి కూడా త్వరగా చంపేయొచ్చు. కత్తెరలు, సుత్తులు వాడి కఫ్ఫర్లను అంతం చేయొచ్చు.

లాక్ డౌన్ ఎడిషన్ కు మౌలానా సాద్, జమాత్ అని పేర్లు పెట్టి కరోనా వైరస్ ను వ్యాప్తి చేసినందుకు పొగడ్తలు కూడా కురిపిస్తున్నారు. జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్లను అరెస్టు చేసినందుకు గానూ ఇది ప్రతీకారచర్యగా చెప్పుకున్నారు. లాక్ డౌన్ సమయంలో కరోనావైస్ క్యారియర్స్ గా ముస్లింలు మారాలని అందులో రాశారు. కొవిడ్ 19ను ఒక ఆయుధంగా మార్చి నాన్ బిలీవర్ల మీద ప్రయోగించాలని తెలిపారు.