Law Minister Kiren Rijijus : ‘న్యాయమూర్తులు చేయాల్సిన పని మానేసి రాజకీయాలు చేస్తున్నారు’: న్యాయశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కోర్టుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి..న్యాయమూర్తులు ప్రజలకు న్యాయం చేసే పని మానేసి కోర్టు్లో రాజకీయాలు చేస్తున్నారు అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

Law minister Kiren Rijijus

minister Kiren Rijijus comments on judges collegium spark controversy : కోర్టుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి..న్యాయమూర్తులు ప్రభుత్వం చేసే పనికూడా చేసేస్తూ తమ సమయాన్ని వృథా చేస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. న్యాయమూర్తులు కేసుల్లో తీర్పులు చెప్పడం మాని తమ సగం సమయాన్ని జడ్జీలుగా ఎవరిని నియమించాలన్న దానికే వృథా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అంతేకాదు కొలీజియం విధానం పారదర్శకంగా లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా న్యాయమూర్తులు స్వయంగా న్యాయమూర్తులను నియమించుకునే పద్ధతి లేదు..కానీ భారత న్యాయవ్యవస్థ నియామకాల్లో మాత్రం ఇది కనిపిస్తోంది అంటూ అహ్మదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ‘పాంచజన్య’ నిర్వహించిన ‘సబర్మతి సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

నాయకుల మధ్య రాజకీయాలను ప్రజలు చూస్తారు కానీ చర్చలు తీవ్రంగా ఉండటంతో న్యాయమూర్తులను నియమించేటప్పుడు న్యాయవ్యవస్థలో జరుగుతున్న రాజకీయాలు వారికి తెలియవు అన్నారు మంత్రి రిజిజు. కొలీజియం ద్వారా జరుగుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పు రావాల్సిందేనన్నారు. న్యాయవ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని..కోర్టుల్లో కంటికి కనిపించని రాజకీయం జరుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు న్యాయం చేయడానికి బదులు కార్యనిర్వహకులుగా వ్యవహరించచాలని చూస్తే మొత్తం వ్యవస్థనే పునఃపరిశీలించాల్సి వస్తుందన్నారు.

కొలీజియం వ్యవస్థలో రాజకీయాలకు తావు లేదన్న మంత్రి.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిజానికి న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే ప్రక్రియ ప్రపంచంలోనే ఎక్కడా లేదని ఇది భారత్ లో కనిపిస్తోందని..ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల ప్రాథమిక పని ప్రజలకు న్యాయం చేయటం..అంతేకాదు న్యాయమూర్తుల నియామకం కాదన్నారు. కోర్టులో రాజకీయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించి మంత్రి సుప్రీంకోర్టులో “గుత్తాధిపత్యం” సృష్టించిన 40-50 మంది న్యాయవాదుల బృందం ఉందని..న్యాయమూర్తులను నియమించేటప్పుడు న్యాయవ్యవస్థలో రాజకీయాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను నియమించడం కేంద్రం బాధ్యత అని..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ న్యాయమూర్తులను నియమించేదని అన్నారు. అయితే, 1998లో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఫలితంగా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తున్నారని అన్నారు. ఎక్కువ మంది న్యాయమూర్తులు తమ విధులను పక్కనపెట్టేసి ఇతర న్యాయమూర్తులను నియమించడంపైనే దృష్టిపెడుతూ సగం కంటే ఎక్కువ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గమనించానని పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో మార్పు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో భారతీయ భాషల్లో మాట్లాడేందుకు సుప్రీంకోర్టులో కూడా అవకాశం రావాలని మన ఆలోచన కూడా ఆ దిశగానే ఉండాలని మంత్రి అన్నారు.

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు.దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ మంగళవారం (అక్టోబర్ 18,2022) మాట్లాడుతూ..న్యాయమూర్తుల నియామకాలను నిర్ణయించడంలో న్యాయమూర్తులు ఎక్కువ సమయం వృథా చేస్తున్నారని మంత్రి అంటున్నారు..మరి అద్దాల గదుల్లో నివసించేవారు ఇతరులపై రాళ్లు వేయకూడదు అంటూ మంత్రికి చురకలు వేశారు.