Bhopal AIIMS: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఎయిమ్స్ వైద్యులు ఐదు నెలల చిన్నారికి కొత్త జీవితాన్ని అందించారు. ఈ బాలిక కడుపులో ఉన్న 300 గ్రాముల రెండు పిండాలను వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత చిన్నారి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. గత ఐదు నెలల బాలిక ఈ ప్రత్యేక వ్యాధితో బాధపడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 200
వాస్తవానికి, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇటువంటి కేసులు 200 వరకు నమోదయ్యాయట. ఈ వ్యాధిని ‘ఫీటస్ ఇన్ ఫుట్’ అంటారు. బాలిక మధ్యప్రదేశ్లోని సత్నా నివాసి అని భోపాల్ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గత నాలుగు నెలలుగా ఆమె కడుపులోని రెండు పిండాలు వేగంగా పెరుగుతున్నాయి. దానివల్ల చిన్నారి చాలా నొప్పిని అనుభవించేదని, రోజంతా ఏడ్చేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అటువంటి పరిస్థితిలో పిండాన్ని తొలగించడానికి ఆపరేషన్ జరిగింది. ఇది విజయవంతమైంది.
బాలిక తరుచూ అస్వస్థతకు గురికావడంతో ఏం జరుగుతుందో తమకు అర్థం అయ్యేది కాదని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత భోపాల్ ఎయిమ్స్లో చెకప్ చేయగా, ‘ఫీటస్ ఇన్ ఫీటస్’ వ్యాధిని గుర్తించారు. ఆ తర్వాత డాక్టర్ ప్రమోద్ శర్మ, డాక్టర్ రోషన్ చంచ్లానీ, డాక్టర్ అంకిత్, డాక్టర్ జైనాబ్ అహ్మద్, డాక్టర్ ప్రతీక్, డాక్టర్ ప్రీతి భోపాల్ ఎయిమ్స్లో బాలికలకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
‘ఫీటస్ ఇన్ ఫీటూ’ వ్యాధి అంటే ఏమిటి?
నిజానికి, ‘ఫీటస్ ఇన్ ఫీటూ’ అనేది ఒక రకమైన వైకల్యం. దీనిని శాస్త్రీయ భాషలో పారాసిటిక్ ట్విన్ అని కూడా పిలుస్తారు. దీనిని గుర్తించడానికి, ప్రాథమిక పరిశోధనలో నిపుణులు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లను ఉపయోగిస్తారు. సాధారణంగా 5 లక్షల మంది పిల్లలలో ఒకరికి ఈ రకమైన వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇటువంటి కేసులు 200 కనుగొన్నారు.