Petrol Price: నాలుగు రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..
- Subhan Ali Shaik
- Published On : March 25, 2022 / 08:21 AM IST
Petrol Rate
Petrol Price: పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు అమ్ముడవుతుంది. మూడోసారి పెరిగిన ధర మొత్తంగా లీటరుకు రూ.2.4లీటర్ పెరిగిందట.
ముంబైలో 84 పైసలు పెరిగి రూ. 112.51 అవగా డీజిల్ 85 పైసలు పెరిగి లీటర్ కు రూ.96.70కు చేరింది. చెన్నైలో 76 పైసలు పెరిగి రూ.103.67కు, డీజిల్ లీటర్ 93.71కు చేరింది. కోల్కతాలో 84 పైసలు పెరిగి రూ.106.34కు చేరింది. డీజిల్ ధర రూ.91.42కు చేరింది.
ఇందన ధరల్లో మార్పులకు ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాస్త బ్రేక్ పడిందంతే. ఎన్నికలు ముగియడం, ఫలితాలు వచ్చిన తర్వాత పెరుగుతూనే ఉన్నాయి.
Read Also : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
