Ramnath Kovind: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరాఖాండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ రాణి రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటుగా ఆ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.

Ramnath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరాఖాండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ రాణి రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటుగా ఆ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.

i. శ్రీ భన్వరిలాల్ పురోహిత్‌ను తమిళనాడు అడిషనల్ ఛార్జ్ పదవి నుంచి పంజాబ్ రెగ్యూలర్ గవర్నర్ గా అపాయింట్ చేశారు.

ii. నాగాలాండ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నర్ గా నియమించారు.

iii. లెఫ్టినెంట్ గుర్మిత్ సింగ్, పీవీఎస్ఎమ్, యూవైఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, వీఎస్ఎమ్ (రిటైర్డ్)ను ఉత్తరాఖాండ్ గవర్నర్ గా నియమించారు.

iv. అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖిని నాగాలాండ్ విధుల నుంచి రెగ్యూలర్ ఏర్పాట్లు పూర్తయ్యే వరకూ కొనసాగాలని చెప్పారు.

ఈ అపాయింట్మెంట్లన్నీ ఆయా ఆఫీసుల్లో ఛార్జ్ తీసుకునే తేదీలను బట్టి ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు