జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు పారించారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోయింది. 2016లో ఉరీ దాడి తర్వాత.. అంతకుమించిన మారణహోమం సృష్టించారు. పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలో CRPF జవాన్లను టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. కారు బాంబు పేలుడులో 42మంది జవాన్లు మృతి చెందారు. మరో 50మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. వారందరిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి తమపనేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అప్పటివరకు తమతో మాట్లాడుతూ కనిపించిన సహచరులు.. కళ్ల ముందే విగతజీవులుగా మారడం చూసి జవాన్లు కన్నీరుమున్నీరు అయ్యారు. అనూహ్య ఘటనతో వారంతా షాక్కు గురయ్యారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉగ్రదాడి. ; ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం ముక్కలైంది. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాడికి 100 కిలోల ఐఈడీని ఉపయోగించారు. 70 వాహనాల్లో 2వేల 500మంది జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్నారు. అదను చూసి ఉగ్రవాదులు దొంగ చాటుగా దెబ్బకొట్టారు. ఓ; ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్లోకి కారును తీసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి సమయంలో కాన్వాయ్లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని; పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్ అహ్మద్గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్లో చేరాడు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి; కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్లపై ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యావత్ దేశం; షాక్కు గురైంది. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా జిల్లాకు అదనపు బలగాలను తరలించారు. ; టెర్రరిస్టుల దాడిలో కీలక పాత్ర పోషించిన అదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ దాడికి ముందు ఓ వీడియో సందేశం నెట్ ద్వారా పంపాడు. త్వరలోనే స్వేచ్చ లభిస్తుందంటూ ఆ వీడియోలో అదిల్ అహ్మద్ ప్రకటించాడు. మొత్తం 45 సెకన్ల వీడియోలో అదిల్ అహ్మద్ ప్రసంగం ఉంది. ఈ వీడియో ఎప్పటిది అనేది తెలీకపోయినా.. తాజా దాడికి సంబంధించినదే అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీడియోలో అదిల్ తన రెండు చేతుల్లో ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకుని..బ్యాక్ డ్రాప్లో జైషే మహ్మద్ జెండాతో ఉన్నాడు. 'ఈ వీడియో మిమ్మల్ని చేరుకునే సమయానికి నేను పరలోకంలో ఉంటాను. జైషే మహ్మద్ సంస్థలో ఏడాది పాటు ఉన్నా. కశ్మీర్ ప్రజలకు ఇదే నా చివరి సందేశం అని’ ఉగ్రవాది అదిల్' చెప్పాడు. ; CRPF 54వ బెటాలియన్కి చెందిన జవాన్లు జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో ప్రయాణిస్తుండగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జైషే మహ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్; కశ్మీర్కు చెందినవాడే అని పోలీసులు గుర్తించారు. దక్షిణ కశ్మీర్ కాకపోరా జిల్లాకు చెందిన అదిల్ జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలో ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏడాదిపాటు శిక్షణ; తీసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే: