ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ(95) ఇకలేరు. పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్పూర్ ప్రాంతంలో 1923 సెప్టెంబరు 14న రామ్ జెఠ్మలానీ జన్మించారు. న్యాయవాద వృత్తిలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చరిత్రలో లిఖించదగ్గ పలు కేసులను ఆయన వాదించారు. సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు, దిగువ కోర్టుల్లోని కీలకమైన కేసులను విజయవంతంగా వాదించారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడి తరఫున 2011లో మద్రాసు హైకోర్టులో వాదనలు వినిపించారు. స్టాక్ మార్కెట్ కుంభకోణం కేసులో హర్షద్ మెహతా, కేతన్ ఫరేఖ్ల తరఫున, పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ఆఫ్జల్ గురు మరశిక్ష కేసు, జెస్సికా లాల్ హత్యకేసులో మను శర్మ ప్రతినిధిగా వాదించారు. అరుణ్ జైట్లీ-కేజ్రీవాల్ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ తరఫున వాదించారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయయారు. 2017 నవంబరులో న్యాయవాది వృత్తి నుంచి తప్పుకున్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. జఠ్మాలనీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా… జెఠ్మాలనీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన ఆయన తొలిసారిగా ముంబై పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున 6వ లోక్సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఇక్కడ నుంచే 1980 ఎన్నికల్లో విజయం సాధించారు.
అలాగే వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీతో విబేధించిన తర్వాత పార్టీ నుంచి విడిపోయి 2004 ఎన్నికల్లో లక్నో పార్లమెంటు స్థానం నుంచి వాజ్పేయి ప్రత్యర్థిగా పోటీచేశారు. 2010లో మరోసారి బీజేపీలో చేరి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.