దేశంలోని రైల్వే స్టేషన్ల పరిశుభ్రతపై నిర్వహించిన సర్వే రిపోర్టును బుధవారం (అక్టోబర్ 2, 2019) విడుదల రైల్వే శాఖ విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ప్రకారం మొదటిస్థానంలో జైపూర్ రైల్వేస్టేషన్, రెండో స్థానంలో జోధ్ పూర్ రైల్వే స్టేషన్, ఏడో స్థానంలో విజయవాడ రైల్వే స్టేషన్ నిలిచింది. రైల్వే స్టేషన్ ల పరిశుభ్రతలో తెలంగాణ వెనుకంజలో ఉంది. 17 వ స్థానంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్, 42 వ స్థానంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నాయి.
ఏపీలోని సామర్లకోట స్టేషన్ 45వ స్థానంలో, తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస స్టేషన్ 92, స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ 51వ స్థానం, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 స్థానంలో నిలిచాయి.
మొత్తం 720 రైల్వే స్టేషన్లలో సర్వే నిర్వహించగా రాజస్థాన్ లోని జైపూర్, జోధ్ పూర్, దుర్గాపుర రైల్వే స్టేషన్లు తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. 109 సబర్బన్ రైల్వే స్టేషన్లలో మొదటి స్థాంనలో అంధేరి, రెండో స్థానంలో విరార్, మూడో స్థానంలో నయిగాం రైల్వే స్టేషన్లు నిలిచాయి.
2016 నుంచి రైల్వే శాఖ ప్రతి ఏడాది 407 ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వచ్ఛత అంశంపై థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా 720 రైల్వే స్టేషన్లు, సబర్బన్ రైల్వే స్టేషన్లలో సర్వే నిర్వహించారు.