200ల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారత్
ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం జనవరి 26,1950
1947 ఆగస్టు 29న అంబేద్కర్ ఛైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు
1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం
రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో రూపొందిన రాజ్యాంగం
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు
1950 జనవరి 26వ తేదీ నుండి అమలు
ఢిల్లీ : భారతదేశం ప్రపంచానికి నాగరికత నేర్పిన అతి గొప్పదేశం. అటువంటి చరిత్ర గలిగిన దేశం బ్రిటీష్ వారి పాలనలో 200ల సంవ్సరాలు మగ్గిపోయింది. ఎంతోమంద్రి త్యాగాల ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలో స్వతంత్రానంతరం భారతదేశ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టం ఆవిషృతమైన రోజు జనవరి 26,1950వ సంవత్సరం. భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. అదే గణతంత్ర దినోత్సవం. మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.
బాబా సాహెబ్ అంబ్రేద్కర్ సారధ్యంలో..ఆయన అధ్యక్షతన 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశంగా ఆవిషృతమయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది. ఈనాటికీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా విరాజిల్లుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు.
1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
ఇలా రూపొందిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర” రాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.