సీజేఐకు ప్రాణహాని…Z+కేటగిరీకి భద్రత పెంపు

గతేడాది అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయన భద్రతను జెడ్​ నుంచి జెడ్​ ప్లస్​కు మార్చింది.


ఇప్పటివరకు భారత ప్రధాన న్యాయమూర్తికి జెడ్​ కేటగిరీ భద్రత ఉండేది. దానిని జెడ్​ ప్లస్​ కేటగిరికి మార్చుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జస్టిస్​ బోబ్డే సీఆర్​పీఎఫ్​, సీఏపీఎఫ్​ బలగాలు భద్రతలో ఉండనున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే 2019 నవంబర్​ 18న బాధ్యతలు చేపట్టారు. కాగా,గతేడాది రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో.. సీజేఐ జస్టిస్​ బోబ్డే ఒకరన్న విషయం తెలిసిందే