తాజాగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు.స్వైన్ ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశం లో చర్చించనున్నారు.
కోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులు పలువురు లాయర్లు హెచ్1ఎన్1 వైరస్ తో బాధపడుతున్నారని జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు లో పని చేసే మిగతా వారికి స్వైన్ ఫ్లూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఐ బొబ్డేను కోరారు. అలాగే న్యాయవాదులకు టీకాలు వేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటు లో ఉంచాలన్నారు. కాగా స్వైన్ ఫ్లూతో ఉండటంతో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మాస్క్ పెట్టుకుని కోర్టుకు వచ్చారు.
అసలు H1N1 వైరస్ అంటే ఏమిటి?.. ‘హెచ్1ఎన్1 ఫ్లూను… స్వైన్ ఫ్లూ’ అని కూడా అంటారు. స్వైన్ ఫ్లూ అంటే పందులలో వచ్చే శ్వాసకోశ వ్యాధి. ఇది ఒక రకమైన ఇన్పఫ్లూయెన్జా వైరస్ ద్వారా పందులలో వస్తుంది.