లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్,బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుంది.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా సోమవారం(మే-13,2019) సీఎం కేసీఆర్ చెన్నై వెళ్లి డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలిసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ఇందుకోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలకాలని కేసీఆర్ స్టాలిన్ ను కోరారు.
అయితే మంగళవారం (మే-14,2019) చెన్నై ఎయిర్ పోర్ట్ లో విలేకరులతో స్టాలిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని తనకు అనిపించడం లేదన్నారు. మే 23, 2019 తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందన్నారు. కూటమి ఏర్పాటులో భాగంగా కేసీఆర్ చెన్నైకి రాలేదని, కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని అన్నారు. ఆలయాల దర్శన కోసం కేసీఆర్ తమిళనాడుకు వచ్చిన సందర్భంలోనే మర్యాదపూర్వకంగా కలిసేందు తన అపాయింట్మెంట్ కోరారని స్టాలిన్ అన్నారు. కేసీఆర్ తో చర్చించిన అంశాలపై మాట్లాడటానికి దాట వేశారు. కేంద్రం బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల కూటమికి అవకాశం అయితే లేదని స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు స్టాలిన్.
DMK President MK Stalin on his meeting with TRS leader & Telangana CM K Chandrashekar Rao: He did not come to Tamil Nadu to form fronts. He came to visit temples. He wanted to meet me. It was a courtesy visit. (file pics) pic.twitter.com/hz9fQnA9zf
— ANI (@ANI) May 14, 2019
DMK chief M K Stalin says he does not see the possibility of the formation of a government of the Third Front at the Centre
Read @ANI | https://t.co/WqeSLgQmpN pic.twitter.com/AQyTEAt4hh
— ANI Digital (@ani_digital) May 14, 2019