కన్నుమూసిన గోగొయ్
- Subhan Ali Shaik
- Updated on- November 23, 2020 / 06:39 PM IST
Tarun Gogoi: అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగొయ్ హాస్పిటల్లో కన్నూమూశారు. 86ఏళ్ల వయస్సున్న ఆయన గౌహతి మెడికల్ కాలేజీలో కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ అందుకుంటున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన పూర్తి ఆరోగ్య వంతులు కాలేక సోమవారం సాయంత్రం 5గంటల 35నిమిషాలకు తుదిశ్వాస విడచిరాు.
అస్సాం మంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఈ విషయాన్ని నిర్ధారిస్తూ మీడియాకు వెల్లడించారు. అవయవాలు పనిచేయకుండా పోవడంతో గోగొయ్ ను వెంటిలేటర్ పై ఉంచాం అన్నారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన ఆయన్ణు నవంబర్ 2న జీఎంసీహెచ్ లో అడ్మిట్ చేశారు.
శనివారం రాత్రి నుంచి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచారు. అక్టోబర్ 25న గోగొయ్ కు కొవిడ్ 19 ట్రీట్మెంట్ జరిగింది. రికవరీ అయిన రెండు నెలల తర్వాత ఇతర సమస్యలు రావడంతో ఆయన తట్టుకోలేకపోయారు. ఆగష్టు 25న పాజిటివ్ రావడంతో తర్వాతి రోజే జీఎంసీహెచ్ లో అడ్మిట్ చేశారు.
