Encounter
Chhattisgarh Encounter : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసు బలగాలపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొహల్లా మాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.