Uttar Pradesh: పందులకు స్వైన్ ఫీవర్.. మాంసం మార్కెట్లు నిషేదించిన బరేలీ
బరేలీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంది మాంసం విక్రయించే మార్కెట్లను బ్యాన్ చేసింది. ఫరీద్పూర్లో 20 పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) శివకాంత్ ద్వివేది మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- Subhan Ali Shaik
- Published On : July 26, 2022 / 03:12 PM IST
African Swine Flu Breaks Out In Tripura, Govt Orders Mass Execution Of Pigs
Uttar Pradesh: బరేలీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంది మాంసం విక్రయించే మార్కెట్లను బ్యాన్ చేసింది. ఫరీద్పూర్లో 20 పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) శివకాంత్ ద్వివేది మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జులై 20న తొలి ఏఎస్ఎఫ్ కేసు నమోదైందని ఇండియన్ వెటరినరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పందులు స్వైన్ ఫీవర్తో మృతిచెందినట్లు కన్ఫామ్ చేశారు.
వాటి నమూనాల నుండి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR)తో వ్యాధిని నిర్ధారించారు. IVRI చీఫ్ వెటర్నరీ అధికారి నుంచి వివరణాత్మక నివేదికను కోరారు.
Read Also : కేరళలో ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ…190 పందులను వధించిన ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, త్రిపుర, అస్సాంలు ఇలాంటి కేసులను చూసిన తర్వాత బరేలీలోనూ నమోదైయ్యాయని బరేలీ IVRI జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కేపీ సింగ్ తెలిపారు.
కొన్ని రోజుల క్రితం నవాబ్గంజ్ తహసీల్లోని భద్సర్ దాండియా గ్రామానికి చెందిన డాక్టర్ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చెందిన పొలంలో పందులకు తీవ్ర జ్వరం వచ్చింది. చికిత్స చేసినప్పటికీ అవి తిండి మానేసి జబ్బుతో మృతి చెందాయి.
ఇతర పందులలో సంక్రమణను తనిఖీ చేయడానికి ఆ గ్రామానికి ఒక బృందాన్ని పంపింది. ఐవీఆర్ఐ తరపున సలహాదారుని కూడా జారీ చేయాలని చీఫ్ వెటర్నరీ అధికారిని కోరారు. దీని ప్రకారం, ASF నిర్ధారించబడిన కిలోమీటరు ప్రాంతాన్ని స్వైన్ ఫీవర్ సోకిన జోన్గా ప్రకటించామని, మానవులకు వ్యాధి సోకే ప్రమాదం లేదని సింగ్ చెప్పారు.
