గుజరాత్ : అగ్రవర్ణాలలోని ఆర్థిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడడంతో చట్టంగా మారింది. ఈ చట్టం అమలు చేసే విషయంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుండే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతోటు విద్యాసంస్థల్లోనూ ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఈ చట్టాన్ని అమలు చేసే ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ ప్రభుత్వం రికార్డులకెక్కనుంది. ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో చట్టంగా మారింది. ఈ క్రమంలో ఈ చట్టాన్ని అమలు చేసేలా దేశంలోనే మొదటిసారి రాష్ట్రంగా గుజరాత్ రికార్డులకెక్కనుంది.