శత్రువులపై దాడులు చేస్తే…ఇక్కడ కొందరు ఏడ్చారు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

  • Publish Date - April 5, 2019 / 11:42 AM IST

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.శుక్రవారం(ఏప్రిల్-5,2019)ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌  లోని అమ్రోహాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ…ఉగ్రవాదులకు వారి భాషలో సమాధానం ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదన్నారు.భార‌త్ త‌న శ‌త్రువుల‌ను ధ్వంసం చేస్తే, ఇక్క‌డ కొంద‌రు ఏడవడం ప్రారంభించారన్నారు.
Read Also : ఏపీలో ఐటీ దాడులు : రాజకీయ రంగు పులుముతారా – జీవీఎల్

ప్ర‌పంచ దేశాల ముందు పాక్ నిజస్వరూపం బయటపడినప్పుడు…మనదేశంలోని కొంతమంది మాత్రం పాక్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని విపక్షాలపై నిప్పులు చెరిగారు.తనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)అత్యున్నత పురస్కారం జయాద్ మెడల్ ప్రకటించడంపై ఈ సందర్భంగా UAE ప్రభుత్వానికి,ప్రజలకు  మోడీ ధన్యవాదాలు తెలిపారు.భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోడీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు. 
Read Also : బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల