3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.

  • Publish Date - January 20, 2020 / 06:01 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మూడు రాజధానులపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. అమరావతిని లెజిస్టేటివ్ రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన హయాంలో కర్నూలుకు మేలు చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినందుకు సంతోషపడుతున్నట్లు తెలిపారు. 

అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు చారిత్రిక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం జరిగే విధంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖటపట్నం ప్రాంతంలో కార్యనిర్వహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనదని ప్రజలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం జరిగే విధంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖటపట్నం ప్రాంతంలో కార్యనిర్వహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనదని ప్రజలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. 

మూడు రాజధానులకు మద్దతు పలకాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని కోరుతున్నట్లు తెలిపారు. న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడి గారిని కూడా వారి మనసు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. అమరావతి ప్రాంతానికి అన్యాయం చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. స్పీకర్.. రేపు ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేశారు. 

అంతకముందు మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. అంతకంటే ముందు..బాబు సుదీర్ఘంగా మాట్లాడడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం చంద్రబాబు మైక్‌ను స్పీకర్ కట్ చేశారు. దీంతో సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు..అంటూ నినాదాలు చేశారు. టీడీపి చేస్తున్న ఆందోళనను వైసీపీ సభ్యులు ఖండించారు. సీఎం జగన్ ప్రసంగం ప్రజలకు తెలియకుండా నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు మంది టీడీపీ సభ్యులు మాట్లాడారని, బాబు గంటన్నరసేపు మాట్లాడారనే విషయాన్ని గుర్తు చేశారు.

తమ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుంటే..కేవలం 7 మంది సభ్యులు మాత్రమే మాట్లాడరని తెలిపారు. సభలో జరిగిన దానిపై బాబు క్షమాపణలు చెప్పాలని మంత్రి అనీల్ కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. 
 

మార్షల్ పిలిచి ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను బయటకు పంపించాలని సీఎం జగన్ సూచించారు. ఏపీ మంత్రి బుగ్గన మార్షల్‌ను పిలిపించారు. ఆందోళన సద్దుమణగకపోవడంతో వారిని 17 మంది సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

అచ్చెన్నాయుడు, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి సస్పెండ్ చేశారు.