Asia Cup 2025: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. పాకిస్తాన్ స్కోర్ ఎంతంటే..

Photo Credi: @BCCI

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. పాక్ బ్యాటర్లను వణికించారు. మన పేసర్లు, స్పిన్నర్ల ధాటికి బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. రెగులర్ ఇంటర్వెల్స్ పాక్ వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 128 పరుగులు చేయాలి.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్లు పడగొట్టారు. పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ టాప్ స్కోరర్. 44 బంతుల్లో 40 పరుగులు చేశాడు. షాహీన్ అఫ్రిదీ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఏకంగా 4 సిక్సులు బాదాడు. ఇద్దరు డకౌట్ అయ్యారు. అయూబ్, మహమ్మద్ నవాజ్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు.