ODI World Cup 2023 : ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ వింత వ్యాఖ్యలు .. మండిపడుతున్న నెటిజన్లు ..

బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ మరోసారి నోరుపారేసుకున్నాడు.

Abdul Razzaq : బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ మరోసారి నోరుపారేసుకున్నాడు. ఐశ్వర్య పై రజాక్ చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాడు. తాజాగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఓడిపోయిన టీమిండియా జట్టుపై రజాక్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు రజాక్ తీరుపై మండిపడుతున్నారు.

Also Read : India Vs Australia T20 Match : రింకూ సింగ్ లాస్ట్ బాల్ లో కొట్టిన సిక్స్ ఎందుకు స్కోర్ బోర్డులోకి రాలేదు.. అసలు విషయం ఏమిటంటే?

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి గురించి ఓ స్పోర్ట్స్ ఛానల్ లో రజాక్ మాట్లాడాడు. భారత్ ఓడిపోవటం క్రికెట్ కు మంచిదంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ ను గెలుచుకునే అర్హత భారత్ జట్టుకు లేదని, ఎందుకంటే వారు పిచ్ లను వారికి అనుకూలంగా మార్చుకున్నారంటూ ఆరోపించాడు. ఫైనల్ లో టీమిండియా గెలుస్తుందని భారతీయులు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కానీ భారత్ జట్టు ఓడిపోయింది. ఒకవేళ భారత్ జట్టు ఫైనల్ గెలిచినట్లయితే అది ప్రపంచ క్రికెట్ కు చాలా విషాద క్షణంగా మారేందంటూ టీమిండియాపై రజాక్ తన అక్కస్సును వెల్లగక్కాడు.

Also Read : Ashwin : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన అశ్విన్‌.. ఆస్ట్రేలియా టాస్ ప్లాన్..

టీమిండియా వాళ్లకు అనుకూలంగా పిచ్ లను తయారు చేసుకుంది. ఏ ఐసీసీకి ఇంత చెత్త పిచ్ ను నేను చూడలేదంటూ.. టీమిండియా ఫైనల్ లో ఓడిపోవటం క్రికెట్ కు గొప్ప విషయం అంటూ రజాక్ వ్యాఖ్యానించాడు. రజాక్ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ జట్టు సెమీస్ కు చేరకపోవటంతో పాక్ మాజీ క్రికెటర్లు టీమిండియాపై తమ అక్కస్సు వెల్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు పాకిస్థాన్ టీంను గాడిలో పెట్టుకొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సలహాలు ఇస్తే బాగుంటుందంటూ రజాక్ వ్యాఖ్యలకు నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు