Ind Vs WI 1st T20I : వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. విండీస్ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ ను భారత్ చేధించలేకపోయింది. 20ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. దీంతో 4 పరుగుల తేడాతో విండీస్ విక్టరీ కొట్టింది.
Also Read..Hardik Pandya: మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు: హార్దిక్ పాండ్యా
భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (22 బంతుల్లో 39 పరుగులు) ఒక్కడే రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 19 రన్స్ చేశారు. సంజూ శాంసన్ 12, అక్షర్ పటేల్ 13, అర్ష్ దీప్ సింగ్ 12 పరుగులు చేశారు.
వెస్టిండీస్ బౌలర్లలో మెక్ కాయ్, జాసన్ హోల్డర్, షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హోసేన్ ఒక వికెట్ తీశాడు. ఈ గెలుపుతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో విండీస్ 1-0 తేడాతో లీడ్ లో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.