Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో ప‌త‌కం.. కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త ఖాతాలో మ‌రో ప‌త‌కం వ‌చ్చి చేరింది.

India Beat Spain To Win Back To Back Bronze Medals

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త ఖాతాలో మ‌రో ప‌త‌కం వ‌చ్చి చేరింది. హాకీ జ‌ట్టు కాంస్య ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త ప‌త‌కాల సంఖ్య నాలుగు చేరింది. ఈ నాలుగు కూడా కాంస్య ప‌త‌కాలే కావ‌డం గ‌మ‌నార్హం.

కాంస్య ప‌త‌కం కోసం గురువారం స్పెయిన్‌తో భార‌త్ త‌ల‌ప‌డింది. 2-1 తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ 30వ నిమిషంలో, 33వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు