పారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య నాలుగు చేరింది. ఈ నాలుగు కూడా కాంస్య పతకాలే కావడం గమనార్హం.
కాంస్య పతకం కోసం గురువారం స్పెయిన్తో భారత్ తలపడింది. 2-1 తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 30వ నిమిషంలో, 33వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు.