సండే ఫైట్ : భారత్ – కివీస్ లాస్ట్ వన్డే

  • Publish Date - February 3, 2019 / 01:51 AM IST

న్యూజిలాండ్‌తో టీమ్‌ ఇండియా లాస్ట్‌ వన్డే
ధోనీ చేరికతో భారత్‌కు జోష్‌
గెలుపు జోరులో న్యూజిలాండ్‌

ఢిల్లీ : భారత్, న్యూజిలాండ్ ఆఖరి పోరుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ఖలీల్, కుల్దీప్, కార్తీక్ స్థానాల్లో ధోని, షమీ, విజయ్ శంకర్‌లకు చోటు దక్కింది. సిరీస్ గెలిచిన ఊపులో కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమ్‌ ఇండియాకు 4వ వన్డేలో చుక్కెదురైంది. బౌల్ట్ పేస్ విజృంభణతో గెలుపు గాడిలో పడిన కివీస్ మళ్లీ ఊపులోకి వచ్చింది. ఇదే జోరులో టీమ్‌ ఇండియాను కట్టడిచేస్తూ సిరీస్‌ను గెలుపుతో ముగించాలని చూస్తోంది కివీస్‌. ధోనీ రాకతో బలం పుంజుకున్న భారత్.. హామిల్టన్‌లో తమకెదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సర్వశక్తులతో సై అంటున్నది. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. 

ట్రెండింగ్ వార్తలు