IPL 2023, PBKS vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR) మధ్య జరిగింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్కతా 16 ఓవర్లలో 146/7 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడింది. దీంతో D/L methodతో ఫలితాన్ని ప్రకటించారు. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
మ్యాచ్ కు చివరి నాలుగు ఓవర్లలో వర్షం అడ్డంకి తగలడంతో D/L methodతో ఫలితం తేల్చారు. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయ దుందుభి మోగించింది.
మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలింది. కేకేఆర్ స్కోరు 146/7 (16 ఓవర్లకి)గా ఉంది. కేకేఆర్ 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. వర్షం వెలిస్తే బ్యాటింగ్ ఆడుతుంది.
కోల్కతా నైట్ రైడర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. రస్సెల్ ధాటిగా ఆడి 35 పరుగులు చేసి సామ్ కుర్రన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ జట్టు స్కోరు 138/7 (15.3/20)గా ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ 5 వికెట్లు కోల్పోయింది. నితీశ్ రాణా 24, రింకు సింగ్ 4 పరుగులకు ఔటయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు 11 ఓవర్లకు 85/5గా ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసి అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు.
కోల్కతా నైట్ రైడర్స్ 2 వికెట్లు కోల్పోయింది. అనుకుల్ రాయ్ 4 పరుగులు చేసి అర్ష్ దీప్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు 17/2 (2 ఓవర్లకు)గా ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ 1.1 ఓవర్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో మన్ దీప్ సింగ్ 2 పరుగులకే ఔటయ్యాడు.
కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లుగా క్రీజులోకి మన్ దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్ వచ్చారు. ముందుగా వెలుతురు సరిగా లేకపోవడంతో.. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
వెలుతురు తక్కువగా ఉండడంతో రెండో ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లుగా క్రీజులోకి మన్ దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్ వచ్చే అవకాశం ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో రాజపక్సే 50, శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆ జట్టు 191 పరుగులు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సౌథీ 2, ఉమేశ్ యాదవ్, సునీల్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్ 5వ వికెట్ కోల్పోయింది. సికందర్ రజా 16 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ స్కోరు 18 ఓవర్లకు 169/5 గా ఉంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ధావన్ ను బౌలర్ వరుణ్ చక్రవర్తి క్లీన్ బోల్డ్ చేశాడు.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ ఔటయ్యాడు. 10 బంతుల్లో 21 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పంజాబ్ స్కోరు 135/3 (13.3 ఓవర్లు)గా ఉంది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ భానుకా రాజపక్సే 30 బంతుల్లో 2 సిక్సులు 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ బాదాక, ఆ వెంటనే ఔటయ్యాడు. క్రీజులో ధావన్ (36 పరుగులు), జితేశ్ శర్మ (3) ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ భానుకా రాజపక్సే అదరగొట్టేశాడు. 30 బంతుల్లో 2 సిక్సులు 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ బాదాడు. ధావన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. పంజాబ్ స్కోరు 109/2 (11 ఓవర్లకు)గా ఉంది.
పంజాబ్ కింగ్స్ స్కోరు 5 ఓవర్లకు 50/1గా ఉంది. శిఖర్ ధావన్ 10, రాజపక్సే 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్ లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔటయ్యాడు. పంజాబ్ స్కోరు 3 ఓవర్లకు 24/1గా ఉంది.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్) వచ్చారు.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, మన్ దీప్ సింగ్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చకరవర్తి
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్ సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేశ్ శర్మ, ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహెర్, అర్ష్దీప్ సింగ్
టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.