Raghu Sharma : 33 ఏళ్ల వయసులో ఐపీఎల్లో తొలి వికెట్.. జై శ్రీరామ్ నోట్తో సంబరాలు.. వీడియో వైరల్
ముంబై లెగ్ స్పిన్నర్ రఘు శర్మ (Raghu Sharma) ఐపీఎల్లో తొలి వికెట్ను సాధించిన తరువాత ఓ నోట్ను జేబులోంచి తీసి ప్రేక్షకులకు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 5, 2026 / 11:50 AM IST
IPL 2026 MI vs LSG Raghu Sharma celebrated with a mysterious note after taking his first ever IPL wicket
- ఐపీఎల్లో తొలి వికెట్ తీసిన తరువాత ముంబై లెగ్ స్పిన్నర్ రఘు శర్మ భావోద్వేగం
- జేబులోంచి ఓ నోట్ను తీసి ప్రేక్షకులకు చూపిస్తూ సంబరాలు చేసుకున్న 33 ఏళ్ల ఆటగాడు
Raghu Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్కు చెందిన 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రఘు శర్మ ఐపీఎల్లో తొలి వికెట్ను సాధించాడు. ఈ క్రమంలో అతడు భావోద్వేగానికి లోనుకావడంతో పాటు తన జేబులో నుంచి ఓ నోట్ ను తీసి చూపిస్తూ సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లక్నో ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ను రఘు శర్మ వేశాడు. ఈ ఓవర్లోని తొలి బంతికి లక్నో బ్యాటర్ అక్షత్ రఘువంశీ (11) షాట్ ఆడాడు. అయితే.. బంతి అతడి బ్యాట్ను తాకుతూ ప్యాడ్ ను తాకి గాల్లోకి లేచింది. బౌలర్ అయిన రఘుశర్మ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇది తొలి వికెట్. ఈ క్రమంలో 15 ఏళ్ల అతడి నిరీక్షణ ముగియడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Surya Dada & all of us trying to read what’s on Raghu’s 📄🤔 pic.twitter.com/j3N10IWdLo
— Mumbai Indians (@mipaltan) May 4, 2026
ముందే రాసి జేబులో పెట్టుకున్న నోట్ను అతడు ప్రేక్షకులకు చూపిస్తూ భావోద్వేగానికి లోనైయ్యాడు. గురువుల కృపతో 15 ఏళ్ల సుదీర్ఘమైన, బాధాకరణమైన నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. నాకు అవకాశం ఇచ్చిన ముంబైకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. జై శ్రీరామ్ అని అందులో రాసి ఉంది.
#RaghuSharma makes a statement with that wicket 🔥
Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg
— Star Sports (@StarSportsIndia) May 4, 2026
చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగ్రేటం చేశాడు రఘు శర్మ. అయితే.. ఆ మ్యాచ్లో వికెట్లు తీయకున్నా నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తాజాగా లక్నోతో మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. మిగిలిన ముంబై బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుని 10 కంటే ఎక్కువ ఎకానమీ నమోదు చేసినప్పటికి కూడా రఘుశర్మ ఒక్కడే 9 ఎకానమీ నమోదు చేశాడు.
THE RAGHU SHARMA NOTE. 📝
“A very painful 15 years by divine mercy of Gurudeva ended today.
Thanks MI for giving me this opportunity.
Ever grateful.
Jai Shree Ram”. 🥹❤️ pic.twitter.com/MKs3aDz5go— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2026
