PIC Credit @ mi twitter
ఐపీఎల్ 2024 సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వరుస ఓటములు తరువాత ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ గెలుపు రుచి చూసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 21 మ్యాచులు పూర్తి కాగా పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచులు ఆడగా అన్నింటిలో గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఆదివారం గుజరాత్ పై విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానానికి చేరుకుంది. లక్నో నాలుగు మ్యాచులు ఆడగా మూడు మ్యాచుల్లో గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు, ఎస్ఆర్హెచ్ ఐదు, పంజాబ్ కింగ్స్ ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక లక్నో చేతిలో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానానికి పడిపోయింది. గుజరాత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడగా రెండు మ్యాచుల్లో గెలిచింది. మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. నాలుగు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.
Virat Kohli : కారు డోరు తెరిచేందుకు తంటాలు పడ్డ కోహ్లి! వీడియో వైరల్..
ఎట్టకేలకు ఈ సీజన్లో విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల ఖాతా తెరిచింది. నిన్నటి వరకు ఆఖరి స్థానంలో ఉన్న ఆ జట్టు రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ముంబై నాలుగు మ్యాచులు ఆడగా మూడింటిలో ఓడిపోయింది. ఎనిమిదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. బెంగళూరు, ముంబై పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ ముంబై మెరుగైన రన్రేటును కలిగి ఉంది.
ఇక ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడగా ఒక్క మ్యాచులో మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ముంబై, బెంగళూరు జట్ల రన్రేటు కంటే ఢిల్లీ రన్రేట్ చాలా తక్కువగా ఉంది.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్క భారతీయుడు.. ఆ వెనకే విరాట్ కోహ్లి