MS Dhoni: ఎంఎస్ ధోనీకి నోటీసులిచ్చిన సుప్రీం కోర్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్పై ఢిల్లీ హైకోర్టు చేసిన పిటిషన్పై విచారణ ప్రారంభించి మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధించింది.
- Subhan Ali Shaik
- Published On : July 26, 2022 / 08:10 AM IST
Ms Dhoni Receives Knee Treatment From Ayurvedic Doctor In Ranchi (1)
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్పై ఢిల్లీ హైకోర్టు చేసిన పిటిషన్పై విచారణ ప్రారంభించి మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధించింది.
న్యాయమూర్తులు UU లలిత్, బేలా M త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమ్రపాలి గ్రూప్ పాత యాజమాన్యం మధ్యవర్తిత్వ ప్రక్రియలో గృహ కొనుగోలుదారులకు న్యాయం జరగాలని సూచించారు.
మార్చి 2019లో, ధోనీ రియల్ ఎస్టేట్ కంపెనీకి తన సేవలకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం ఆమ్రపాలి గ్రూప్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ధోనీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్పై మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది.
Read Also : ఎంఎస్ ధోనీకి ఏమైంది. రూ.40లతో నాటు వైద్యం..!
ఆమ్రపాలి, దాని డైరెక్టర్లకు నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకోవచ్చో అన్వేషించాలని నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులను కోర్టు కోరింది.
గృహ కొనుగోలుదారులపై అనవసరంగా భారం పడకూడదని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణానికి లోటును తీర్చేందుకు గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున అదనపు మొత్తాన్ని విధించవద్దని సూచించింది. ఈ మేరకు ఎస్సీ నియమించిన రిసీవర్ ప్రతిపాదనను కోర్టు మరోసారి వ్యతిరేకించింది.
“నిర్మాణ వ్యయం, వడ్డీ వ్యయం ఏదైనా ఉంటే వాటిని తగ్గించడానికి రిజర్వ్ ఫండ్ సృష్టిస్తారు. గృహ కొనుగోలుదారులందరూ బుక్ చేసిన యూనిట్ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున లెక్కించిన మొత్తాన్ని డిపాజిట్ చేయమని కోరతారు. అటువంటి నిధులను ఉపయోగించకపోతే, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. అలాంటిది గృహ కొనుగోలుదారులు చేసిన ప్రారంభ బుకింగ్ నుండి, నిర్మాణ వ్యయం పెరిగింది” అని రిసీవర్ తరపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.
జనవరి 2019లో, నిలిచిపోయిన రెండు ఆమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)కి అనుమతి ఇచ్చింది సుప్రీం కోర్టు.
