T20 World Cup 2024 : టీ20ల‌కు హార్దిక్‌పాండ్య కెప్టెన్‌గా వ‌ద్దు.. అందుకు స‌రైనోడు అత‌డే : గంభీర్

T20 World Cup : టీ20ల‌కు కూడా రోహిత్ శ‌ర్మ‌ కెప్టెన్సీ బాధ‌త్యలు నిర్వ‌ర్తించాల‌ని, అత‌డి సార‌థ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో బ‌రిలోకి దిగాల‌ని సూచించాడు మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్.

వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2023 ముగిసింది. వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన భార‌త్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మిపాలైంది. కాగా.. ప్ర‌స్తుతం టీమ్ఇండియా ఆసీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ సిరీస్‌ను మ‌రో ఏడు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌న్నాహ‌కంగా భావించ‌వ‌చ్చు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో హార్దిక్‌పాండ్య గాయప‌డిన సంగ‌తి తెలిసిందే. హార్థిక్ ఇంకా కోలుకోక పోవ‌డంతో ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సూర్య‌కుమార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

దీనిపై మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ స్పందించాడు. టీ20ల‌కు కూడా రోహిత్ శ‌ర్మ‌ కెప్టెన్సీ బాధ‌త్యలు నిర్వ‌ర్తించాల‌ని, అత‌డి సార‌థ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో బ‌రిలోకి దిగాల‌ని సూచించాడు. ఖ‌చ్చితంగా టీ20 జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ఉండాల‌న్నాడు.

Rohit Sharma Daughter : నాన్న రూమ్‌లో ఉన్నాడు.. ఒక నెల‌లోమ‌ళ్లీ న‌వ్వుతాడు..! రోహిత్ కూతురు స‌మైరా వ్యాఖ్య‌లు వైర‌ల్‌

‘వెస్టిండీస్‌-యూఎస్ఏ ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ప్ర‌క‌టించే జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ను ఎంపిక చేయాల్సిందే. అంతేకాదు.. టీమ్ఇండియాకు రోహిత్ సార‌థ్యం వ‌హించాలి. అవును నాకు తెలుసు ప్ర‌స్తుతం టీ20ల‌కు హార్ధిక్ పాండ్య కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కానీ రోహితే కెప్టెన్‌గా ఉండాలి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ కెప్టెన్సీ తీరు అద్భుతం. ముఖ్యంగా ప‌వ‌ర్ ప్లేలో అత‌డి బ్యాటింగ్ తీరుకు ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందే. బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం చెలాయించాడు. అందుక‌నే అత‌డిని టీ20ల‌కు తీసుకోవాలి.’ అని గంభీర్ అన్నాడు.

‘రోహిత్ శ‌ర్మ‌ను జ‌ట్టులోకి తీసుకుంటే ఆటోమేటిక్ గా విరాట్ కోహ్లీ కూడా వ‌చ్చేస్తాడు. అయితే.. అంత‌క‌ముందు రోహిత్ శ‌ర్మ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడాల‌నే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అత‌డిని ఓ బ్యాట‌ర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ ఎంపిక చేయాలి.’ అని గంభీర్ తెలిపాడు.

అప్ప‌టి నుంచి ఒక్క మ్యాచ్ ఆడలేదు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లో సెమీ పైన‌ల్ మ్యాచ్ త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున రోహిత్ శ‌ర్మ‌  ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడ‌లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోస‌మ‌ని టెస్టులు, వ‌న్డే ఫార్మాట్‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాడు. అయితే.. మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ టీ20 లు ఆడే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది. 36 ఏళ్ల రోహిత్ కుర్రాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని భావిస్తున్నాడ‌ని, వాళ్ల‌కి అడ్డంకిగా మార‌కూడ‌ని అనుకుంటున్నాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు చెబుతున్నాయి.

cricket Fan : నువ్వు టీమ్ఇండియా కోచ్‌గా రా బాసూ..! నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న ఫ్యాన్‌.. వీడియో

ట్రెండింగ్ వార్తలు