Sai Sudharsan Vs Virat Kohli: విరాట్ కోహ్లిపై ప్రతీకారం తీర్చుకున్న సాయి సుదర్శన్.. ఏం చేశాడో చూడండి..
జీటీ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ వికెట్ పడిన తర్వాత, కోహ్లీ దాదాపు ప్రతి బంతికి సుదర్శన్ దగ్గరగా వెళ్లాడు. అతడిని కవ్వించేలా మాట్లాడాడు. తొలి వికెట్ పడిన తర్వాత సాయి సుదర్శన్ భయపడ్డాడని..
- Naveen
- Updated on- June 1, 2026 / 12:28 AM IST
Sai Sudharsan Vs Virat Kohli: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంజాయ్ మెంట్ ఇచ్చింది. ఆర్సీబీ, జీటీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో మంచి డ్రామా నడిచింది. ఇరు జట్ల ప్లేయర్లు సై అంటే సై అంటూ కాలు దువ్వారు. ఇక ఈ మ్యాచ్ లో జీటీ ప్లేయర్ సాయి సుదర్శన్, ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచింది. తుదిపోరులో విరాట్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు సాయి సుదర్శన్. కోహ్లీతో మాటల యుద్ధానికి దిగి అందరి దృష్టిని అట్రాక్ట్ చేశాడు. స్లెడ్జింగ్ కు దిగి విరాట్ పై రివెంజ్ తీర్చుకున్నాడు సాయి సుదర్శన్.
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ క్రీజులో ఉండగా, అంతకుముందు ఆర్బీసీ స్టార్ తనకు చేసిన దానికి ప్రతీకారంగా సాయి సుదర్శన్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నించాడు. వివాదం ముదరకపోయినప్పటికీ, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.
జీటీ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ వికెట్ పడిన తర్వాత, కోహ్లీ దాదాపు ప్రతి బంతికి సుదర్శన్ దగ్గరగా వెళ్లాడు. అతడిని కవ్వించేలా మాట్లాడాడు. తొలి వికెట్ పడిన తర్వాత సాయి సుదర్శన్ భయపడ్డాడని, జీటీ ఓపెనర్గా అతనిపై చాలా ఒత్తిడి ఉందని కోహ్లీ చెప్పినట్లు వినబడింది.
తరచుగా జరిగిన స్లెడ్జింగ్ సాయి సుదర్శన్ పై ప్రభావం చూపినట్లుగానే ఉంది. 4వ ఓవర్లోని నాలుగో బంతికి షాట్ను సరిగ్గా ఆడలేక తక్కువ స్కోరుకే ఔటయ్యాడు సాయి సుదర్శన్. తద్వారా తన జట్టుకు చెప్పుకోదగ్గ సహకారం అందించే అవకాశాన్ని కోల్పోయాడు.
కోహ్లీ ఒక జీటీ బ్యాటర్ను స్లెడ్జింగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు, గ్రూప్ దశ మ్యాచ్లలో, ప్లేఆఫ్స్లో కూడా.. కెప్టెన్ గిల్ తన అత్యుత్తమ ఆటను ఆడకుండా దృష్టి మరల్చడానికి, కోహ్లీ సరదాగా అతని బ్యాటింగ్ సమయంలో విసిగిస్తూ కనిపించాడు.
ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సాయి సుదర్శన్ సైతం స్లెడ్జింగ్ కు దిగాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న విరాట్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి కొన్ని మాటలు మాట్లాడాడు. విరాట్ కోహ్లీ, సాయి ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, కోహ్లీని ఔట్ చేసే అవకాశం ఉందని సాయి తన హావభావాలతో సూచిస్తున్నట్లు అనిపించింది. అయితే, కోహ్లీ అతడి మాటలను పట్టించుకోకుండా ఛేజింగ్ను కొనసాగించడానికి నాన్-స్ట్రైకర్ ఎండ్కు తిరిగి వెళ్ళాడు.
ఈ వ్యవహారం ముదరలేదు. అంతేకాదు వారిద్దరి మధ్య సంభాషణ వాదనలా కాకుండా స్నేహపూర్వకంగా, సరదాగా జరిగినట్లు అనిపించింది. ఏదేమైనా, ఇది మ్యాచ్ చూస్తున్న అభిమానులకు కచ్చితంగా ఇది ఫన్, ఎంటర్ టైన్ మెంట్ అందించింది.
Also Read: ఐపీఎల్ 2026 అవార్డులు.. ఏ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే..
— crictalk (@crictalk7) May 31, 2026
