Cricketers Prayers At Mahakaleshwar Temple
Mahakaleshwar Temple : భారత జట్టు యువ ఆటగాళ్లు సోమవారం తెల్లవారుజామున మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యక్ష్య మయ్యారు. వేకువ జామునే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంకు చేరుకొని భస్మ హారతి పూజలో పాల్గొన్నారు. తెల్లవారు జామునే ఆలయంకు చేరుకున్న యువ క్రికెటర్లు జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్ లకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం నందీ హాల్ లో సాధారణ భక్తులతోపాటు కూర్చొని భస్మ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శివయ్యకు అభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో క్రికెటర్లు వీక్షించారు.
మహాకాళేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, యువ క్రికెటర్లు కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో గడిపారు. శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో యువ క్రికెటర్లు మహాకాళేశ్వరుడిని దర్శనం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
A.lso Read : IND vs AFG 2nd T20 : దంచికొట్టిన శివమ్ దూబె, యశస్వి జైస్వాల్.. రెండో టీ20 భారత్ విజయం.. సిరీస్ కైవసం
టీమిండియా అప్ఘాన్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో టీ20ని ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్థాన్ జట్టు భారత్ ముందు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 15.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (68), శివమ్ దూబే (63 నాటౌట్) రాణించారు. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఈనెల 17న బెంగళూరులో జరగనుంది.
#WATCH | Madhya Pradesh | Indian cricketers Tilak Varma, Washington Sundar, Jitesh Sharma & Ravi Bishnoi attend 'Bhasma Aarti' performed at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/PGYyiS809h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 14, 2024