World Cup 2023 IND vs PAK
World Cup 2023 IND vs PAK : క్రికెట్ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14 కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున వన్డే ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని ఆంగ్ల మీడియాతో కథనాలు వస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ ఆరంభ వేడుకలు నిర్వహించకపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు.
ఈ నేపథ్యంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఆ లోటును భర్తీ చేయాలని బీసీసీఐ అనుకుంటుందట. అందులో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారీగా లైటింగ్ షో నిర్వహించనుందట. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారట. వీటితో పాటు డ్యాన్స్లు, మరికొన్ని పర్మార్మెన్సులు ఉండనున్నాయని అంటున్నారు. ఈ వేడుకలు 12:40 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:10 గంటలకు ముగుస్తాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్కు గోల్డెన్స్ టికెట్స్ పొందిన వారికి బీసీసీఐ ఆహ్వానించిందని సమాచారం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ తలైవా రజినీకాంత్లకు బీసీసీఐ గోల్డెన్ టికెట్లను అందించిన సంగతి తెలిసిందే. వీరు ఈ కార్యక్రమానికి హాజరవుతారు కానున్నట్లు తెలుస్తోంది.
Major updates about India vs Pakistan match in Narendra Modi stadium. [Dainik Jagran]
– Amitabh Bachchan, Rajinikanth, Sachin will attend the match.
– Arjit Singh will perform on stage.
– There will be a colourful program ahead of the game. pic.twitter.com/U8H6UVz3W3— Johns. (@CricCrazyJohns) October 11, 2023