×
Ad

Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు సంచలన కామెంట్స్.. సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి విచారణ జరిపించాలి.. గుండాల రాజ్యంగా మార్చారు.

Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.

Harish Rao

Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి సందర్భంగా సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ఫైర్ అయ్యారు.

దీపావళి పర్వదినాన చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందని హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మతసామరస్యానికి ప్రతీకగా ఉండేది. చార్మినార్‌లో భాగంగా అమ్మవారి దేవాలయం ఉండడం హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం వంటి సాంప్రదాయాలు ఉన్న గొప్ప సంస్కృతి మనది. హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని పేర్కొన్నారు.

Also Read: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు రేపటి నుంచి దర్శనాలు బంద్.. ఇక ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే.. ఎందుకంటే?

రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఉంది. ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్‌ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన. స్వయాన ముఖ్యమంత్రే హోం మంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైంది. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం ఏర్పడింది. ప్రజల ప్రాణమానాలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని హరీశ్ రావు అన్నారు. క్యాబినెట్‌లో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పనిలేదు. స్వయానా మంత్రి కుమార్తెనే చెప్పింది. గన్ ఎవరు తెచ్చారు అనేదానిపై సమాధానం చెప్పమనండి. తుపాకులు పెట్టి అక్రమార్జన చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నిజానిజాలు తేల్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఇవి. మీరు నిజంగా తప్పు చేయలేదు అంటే విషయాలు బయటకు తేవాలి. తప్పులు చేయకపోతే పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లారు? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధాయంగా మారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నారు. ఈరోజు పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడానికి మీలో మీరు తన్నుకు చస్తున్నారా..? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. మేము అగ్రికల్చర్‌ని పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్‌ని పెంచింది అంటూ రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.