Chevella Bus Incident
Chevella Bus Incident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లు సహా 19మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో అంతేలేని విషాదాలను నింపింది. ప్రమాదం జరిగినతీరుపై  అడిషనల్ డీజీ కేఎస్ రావు వివరాలు వెల్లడించారు.