Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ

ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ భయపడుతున్నారని బీజేపీనేత, నటి ఖుష్బూ విమర్శించారు.

Khushbu : ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ భయపడుతున్నారని బీజేపీనేత, నటి ఖుష్బూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖుష్బు మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం బీజేపీకి పెద్ద కష్టమైన పని కాదని తెలిపారు.

ఎక్కడైనా పోటీ అనేది ఉండాలి. మాకు సరైన పోటీ ఉండాలనే మేం భావిస్తున్నాం. పోటీ లేకపోతే ఎలాంటి ఆసక్తి ఉండదు. మోదీజీ వెనక్కి పోవాలంటూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్‌ పెట్టారని అన్నారు. వీటిని చూస్తుంటే టీఆర్ఎస్ భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. మూడోసారి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లలేదని విమర్శించారు. దీంతోనే కేసీఆర్‌ ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కుష్బూ అన్నారు.

Read Also : Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

దేశాన్ని, దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బీజేపీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పుడు అవన్నీ ప్రజలకు దగ్గరయ్యాయని తెలిపారు. దేశంలో ఎక్కడా వారసత్వ పాలన ఉండకూడదన్నారు. ఇప్పుడా ఆ పరిస్థితి దాటిపోయిందన్నారు. వారసత్వ రాజకీయాలను సహించేది లేదని ఖుష్బూ చెప్పారు. దేశం ముందుకు వెళ్లాలి కదా అన్నారు. బీజేపీ పాలనపై ప్రజలు సంతోషంగా 2019 ఎన్నికల్లో గెలిపించేవారు కాదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అది ప్రజలే చూస్తారని ఖుష్బు స్పష్టం చేశారు.

Read Also : Khushbu Sundar : సీనియర్ నటి, తమిళ బిజెపి నాయకురాలు ఖుష్భుకి కరోనా పాజిటివ్

ట్రెండింగ్ వార్తలు