×
Ad

Balloon Blast: గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లో పేలుడు కలకలం.. నలుగురికి గాయాలు

నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Published On : March 6, 2026 / 07:07 PM IST

Representative Image (Image Credit To Original Source)

 

 

Balloon Blast: హైదరాబాద్ గచ్చిబౌలిలో పేలుడు కలకలం రేగింది. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ లో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో హోలీ ఈవెంట్ లో అడ్వర్ టైజ్ మెంట్ బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ బెలూన్ గాలికి ఎగురుతూ ​గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలోకి వచ్చింది. తమ ప్రాంగణంలో పడ్డ ఆ బెలూన్ ని తీయడానికి బ్రహ్మకుమారిస్ వాలంటీర్లు ప్రయత్నించారు. బెలూన్ తీసే క్రమంలో అకస్మాత్తుగా అది పేలిపోయింది. దీంతో నలుగురు వాలంటీర్లు గాయపడ్డారు. ​గాయపడిన వారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇండియాపై యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ ఆపేసిన ఖతార్.. రేట్లు ఏ రేంజ్ లో పెరుగుతాయో..!