BRS MLC Kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. డెడికేటెడ్ కమిషన్కు నివేదిక ఇచ్చామని, బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదని చెప్పారు.
రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాంతీయ పార్టీలతోనే న్యాయం జరిగిందని తెలిపారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టులో చెప్పిందని అన్నారు.
బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు. బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని అన్నారు. 11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదని చెప్పారు.
డెడికేటెడ్ కమిషన్కు కుర్చీ లేదు, ఏర్పాట్లు ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎట్లా ఇస్తుందని నిలదీశారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా? లేదా? అనేది ప్రభుత్వం చెప్పాలని అన్నారు. బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం.. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక