brslp
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అగ్నిపర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను గుండెల్లోనే దాచుకుని మౌనంగా ఉంటున్నానని తెలిపారు.
తన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని కేసీఆర్ చెప్పారు. కన్న తండ్రిగా తాను బాధ అనుభవిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన వద్దని చెప్పారు. ఆరుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు.
కాగా, బీఆర్ఎస్ ఎల్పీ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై పోరాడాల్సిన తీరును వివరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రధానంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణలో శాంతిభద్రతలపై ప్రశ్నించనుంది.
Also Read: ఏపీకి ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?- కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్