మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది ఈ కేసు వల్లే..
నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి(Meenakshi Natarajan)పై లైంగిక వేధింపులు కేసు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
- V Santhosh Kumar
- Updated on- June 10, 2026 / 11:19 AM IST
Meenakshi Natarajan Rajya Sabha nomination was rejected due to the sexual harassment case in Narayanpet.
- కాంగ్రెస్ నేతలపై కోర్టు సమన్లు జారీ
- లైంగిక ఆరోపణల కేసుతో రాజకీయ దుమారం
- రాజ్యసభ నామినేషన్ వివాదం పెరిగింది
Meenakshi Natarajan: నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసు ఆధారంగా పార్టీపై చర్యలు తీసుకోలేదంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో వివాదం మరింత ముదిరింది. ఆ పిటిషన్లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్((Meenakshi Natarajan)) సహా పలువురు కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తూ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
పిటిషన్లో కీలక ఆరోపణలు:
పిటిషనర్ శ్రీలత ప్రకారం, శివకుమార్ రెడ్డిపై ఇప్పటికే పలు పోలీస్ కేసులు నమోదైనప్పటికీ, పార్టీ ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె ఆరోపించారు. అలాగే ఈ విషయంపై మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సహా పలువురు నేతల పాత్రను ఆమె పిటిషన్లో ప్రస్తావించారు.
కోర్టు సమన్లు, నామినేషన్ తిరస్కరణ చర్చ:
ఈ పిటిషన్ను పరిశీలించిన హైదరాబాద్ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, మీనాక్షీ నటరాజన్ సహా పలువురు నేతలకు సమన్లు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ అంశం రాజకీయంగా ప్రభావం చూపుతూ, ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు కూడా ఈ వ్యవహారం కారణమైందనే చర్చ కొనసాగుతోంది. అయితే నామినేషన్ తిరస్కరణపై అధికారికంగా ఎన్నికల కమిషన్ కారణాలు స్పష్టం చేయాల్సి ఉంది.
