Revanth Reddy : బైబై కేసీఆర్ అంటూ ఉచిత కరెంట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు : రేవంత్ రెడ్డి

బైబై కేసీఆర్ అంటూ ఉచిత కరెంట్ పై వస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి కేసీఆర్ అవినీతిని అంతం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

KCR.. Revanth reddy

Revanth Reddy Free Power KCR: ఉచిత విద్యుత్ పై తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో రాష్ట్రంలో కాక రేపాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. ఉచిత విద్యుత్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ రేవంత్ వివరణ ఇచ్చినా విమర్శలు కొనసాగుతున్నానే ఉన్నాయి. ఈక్రమంలో రేవంత్ మరోసారి స్పందించారు. అసలు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ స్పష్టం చేసినా ఈ విమర్శలు కొనసాగటంపై రేవంత్ ట్విట్టర్ వేదికగా ..‘‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది..ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ చేసే అవినీతిని అంతం చేస్తుంది’’అని స్పష్టంచేశారు.

TPCC Campaign Committee : టీపీసీసీ ప్రచార కమిటీ నియామకం… పొంగులేటికి కీలక పదవి

కాగా అమెరికా పర్యటలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని అది అవసరం లేదని మూడు గంటలు ఇస్తే చాలని చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఆ కాక ఇంకా తగ్గనేలేదు. దీనిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఖండించారు. ఈ ఉచిత కరెంట్ అనే వ్యాఖ్యలపై తెలంగాణలో ఇంకా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. అలా ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతోంది.

తన వ్యాఖ్యలపై ఇప్పటికే స్పష్టత నిచ్చిన రేవంత్.. తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది” అని ఈ రోజు ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన పోస్ట్‌కు ‘బైబై కేసీఆర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు