గీజర్లోని వేడినీళ్ల వల్ల ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన లేఖ్య అనే అమ్మాయి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లిలోని ఇక్ఫాయ్ వర్సిటీ కాలేజీలో బీబీఏ చదువుతున్నారు.
గత రాత్రి స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి గీజర్లోని నీటిని ఒంటిపై పోసుకున్నారు. నీళ్లు ఎక్కువ వేడి ఉండడంతో ఆమె ఒంటిపై గాయాలయ్యాయి. ఆమె అరవడంతో తోటి విద్యార్థినులు వెంటనే యాజమాన్యానికి, ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు.
ఆమెకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మొదట చికిత్స అందింది. ఆ తర్వాత దిల్సుక్ నగర్లోని ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స అందించారు. అ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో సత్యం లేదని చెప్పారు.