×
Ad

Telangaana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లోని రైతులకు భారీ శుభవార్త.. ఉచితంగా రూ.6 లక్షలు.. నెలకు రూ.3వేల నుంచి 5వేలు

Telangaana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని గిరిజన రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది.

Telangaana Govt

  • రాష్ట్రంలోని గిరిజన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
  • ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలుకు వేగంగా అడుగులు
  • సబ్సిడీపై రూ.6లక్షల విలువైన పరికరాలు
  • విద్యుత్‌ను తయారు చేసి.. విక్రయించొచ్చు

Telangaana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని గిరిజన రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని గిరిజన రైతుల సాగు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది.

Also Read : Gold Price : బంగారం, వెండి ధరలు కొద్దిరోజుల్లో భారీగా తగ్గబోతున్నాయా..? కానీ, అలా జరగాలి.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని గతేడాది మే 19వ తేదీన అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యంలేని భూములకు ఈ సోలార్ పంపులు అందించనున్నారు. అయితే, కేవలం సాగునీరు అందించడమే కాకుండా రైతును విద్యుత్ తయారీదారుడిగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కోసం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) నుంచి రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే నాబార్డు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ప్రభుత్వ గ్యారెంటీతో మొదటి విడతలో రూ.600 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే మార్చి నెల నాటికి ఈ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.

నాబార్డు ద్వారా వచ్చే రుణ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్లో కూడా ప్రభుత్వం మరో రూ.600 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పథకం అమలు మరింత వేగం కానుంది.

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని సుమారు 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఒక్కో రైతుకు దాదాపు రూ.6లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు.

మరోవైపు.. వ్యవసాయ అవసరాల కోసం వాడుకోగా.. మిగిలిన విద్యుత్ గ్రిడ్ కు విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రైతులకు నెలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఆధాయం కూడా సమకూరుతుంది. నాబార్డు నుంచి నిధులు అందిన వెంటనే ఈ పథకంలో భాగంగా జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు.