తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,607 కరోనా కేసులు

  • Publish Date - November 7, 2020 / 10:21 AM IST

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,607 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891 కు చేరింది. 24 గంటల్లో 6 కరోనా బారిన పడి మృతిచెందారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,372కు చేరింది.

కరోనా నుంచి తాజాగా 937 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోలుకున్న వారి సంఖ్య 2,27,583 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



వారిలో 17,134 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,644 పరీక్షలు నిర్వహించారు. దాంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా టెస్ట్‌ల సంఖ్య 45,75,797కు చేరింది.
https://10tv.in/corona-virus-cases-exceeding-4-lakhs-in-delhi/
44,644 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,607 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.



నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,372కి చేరింది. కరోనాబారి నిన్న 937 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,27,583కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 19,936 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 45,75,797కి చేరింది.



గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 296, ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 124, జగిత్యాల్‌ 42, జనగాం 29, ములుగు 37, నాగర్‌ కర్నూల్‌ 43, నల్గొండ 67, నారాయణ్‌పేట్‌ 0, నిర్మల్‌ 16, నిజామాబాద్‌ 23, పెద్దంపల్లి 26, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 115, సంగారెడ్డి 41, సిద్ధిపేట్‌ 69, సూర్యాపేట 46, వికారాబాద్‌ 16 కేసులు నమోదయ్యాయి.



ఇక వనపర్తి 22, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 9, కామారెడ్డి 30, కరీంనగర్‌ 78, ఖమ్మం 84, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 14, మహబూబ్‌ నగర్‌ 23, మహబూబాబాద్‌ 28, మేడ్చల్ మల్కాజ్‌గిరి 113, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 48, యాద్రాది భువనగిరి 29, మంచిర్యాల్‌ 30, మెదక్‌ 19 కేసులు నమోదయ్యాయి.