TS RTC
TSRTC MD VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ -25, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు 2024 జనవరి 1 (రేపటి) నుంచి ఫ్యామిలీ -24, టీ-6 టికెట్లను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విటర్ వేదికగా తెలిపారు.
Also Read : Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకంపై TSRTC జీరో టికెట్స్ జారీ
ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి.. వారి వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచి ఈ రెండు రకాల టికెట్లను జారీ చేయడం లేదని, ప్రయాణికులు గమనించాలని సజ్జనార్ సూచించారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023