Congress : కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు విజయం

కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కమార్ రెడ్డి గెలుపొందారు.

Congress won

Congress won : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధీక్యంలో ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కమార్ రెడ్డి గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. అశ్వారావుపేటలో జారే ఆధినారాయణ, ఇల్లందులో కోరం కనకయ్య, రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట చిక్కుడు వంశీ కృష్ణ, మహబూబ్ నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర జి.మధుసూదన్ రెడ్డి గెలుపొందారు.

Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనడానికి ఫలితాలు నిదర్శనం : ఉత్తమ్

జడ్చర్ల అనురుధ్ రెడ్డి, షాద్ నగర్ వీర్లపల్లి శంకర్, మఖ్తల్ శ్రీహరి, నారాయణ పేట చిట్టెం పర్ణిక, నాగర్ కర్నూలు కూచకుల రాజేష్ రెడ్డి, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, వనపర్తి తూడి మేగారెడ్డి విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ విజయం సాధించారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై ఆయన గెలుపొందారు.

మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. 36వేల ఓట్లకుపైగా మెజార్టీతో భట్టి గెలుపొందారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం సాధించారు. 27,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

 

ట్రెండింగ్ వార్తలు