సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించిన అమిత్ షా
- bheemraj
- Published On : November 29, 2020 / 02:44 PM IST
Amit Shah road show : గ్రేటర్ హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో ముగిసింది. సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించారు. బస్సు దిగి బీజేపీ ఆఫీస్ కు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం రోడ్ షో ముందుకు సాగలేదు.
కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ్ షో ఆలస్యం అయింది. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో కొనసాగాల్సివుంది. కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
