YS Sharmila: మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు.. కేసీఆర్ అవినీతి చిట్టా అంతా..: షర్మిల

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కేసీఆర్ పై చర్యలకు చేతులు ఎందుకు రావని నిలదీశారు.

YS Sharmila

YS Sharmila – KCR: సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ అంటోందని వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ(BJP)కి బీఆర్‌ఎస్ (BRS) బీ టీం కాకపోతే కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా మోదీ దగ్గరుందని చెప్పారు. మోదీ చెప్పినట్లు కేసీఆర్ ఆడుతున్నారని తెలిపారు.

ఢిల్లీ దాకా సీఎం కేసీఆర్ అవినీతి పాకిందని బీజేపీ చెబుతోందని షర్మిల అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కేసీఆర్ పై చర్యలకు చేతులు ఎందుకు రావని నిలదీశారు. కేసీఆర్ ను మోదీ కేడీ అంటే, మోదీని బోడీ అని కేసీఆర్ అంటారని చెప్పారు. ” నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను పడ్డట్లు ఏడుస్తా ” ఇదే ఇద్దరి మద్య రహస్య ఒప్పందం అని షర్మిల ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అవినీతిపై మోదీ దగ్గర సమాచారం ఉంటే ఇన్నాళ్లూ ఎందుకు విచారణ జరిపించలేదని షర్మిల నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సాక్ష్యాధారాలు బీజేపీ చేతుల్లో పెట్టుకుని యాక్షన్ తీసుకోకపోవడమే బీఆర్ఎస్, బీజేపీ రహస్య బంధానికి ప్రతీక అని చెప్పారు.

లిక్కర్ స్కాంపై దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. అనంతరం కేసీఆర్ బిడ్డ కవిత ప్రధాన సూత్రదారి అని తెలిసి, ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం వాి దోస్తానాలో భాగమని అన్నారు. టీఎస్పీఎస్సీ స్కాంపై కేంద్ర ప్రభుత్వం వేసిన ఈడీ విచారణలో ఐటీ మంత్రి లోపమే అని తెలిసి పట్టింపు లేకపోవడం కూడా ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని చెప్పారు.

Smriti Irani: అటువంటి పార్టీతో రాహుల్ గాంధీ కలుస్తున్నారు: స్మృతీ ఇరానీ

ట్రెండింగ్ వార్తలు