టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు: పవన్పై పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్.. నర్సాపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తానన్న పాల్.. 22వ తేదీన ఉదయం 10గంటలకు నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ సంధర్భంగా చంద్రబాబు, పవన్ జగన్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్.. రూ.5కోట్లు, రూ.10కోట్లకు టిక్కట్లు అమ్ముకుంటున్నారని పవన్ సన్నిహితుడు చెప్పారని, తనతో కలసి రమ్మంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కలవలేదని, పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాగే పవన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, చిరంజీవి పార్టీని మూసేసినట్టుగానే పవన్ కూడా జనసేనను మూసివేస్తారని, పవన్ ఇలా చేస్తాడని ఊహించలేదంటూ చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 25శాలం మాత్రమే నెరవేర్చారని హామీలు చంద్రబాబు నెరవేర్చలేదంటూ చెప్పారు. చంద్రబాబే చేయలేనప్పుడు జగన్, పవన్లు అసలు చేయలేరని పాల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను అమెరికాలా మార్చే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకే సాధ్యమని, హెలికాప్టర్లలో తిరుగుతున్న నేతలకు ఓట్లు వేయొద్దని, హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేయాలని పాల్ ప్రజలను కోరారు.